AP TET DSC 3 వ తరగతి TELUGU

3 వ తరగతి

నూతన తెలుగు వాచకం

◆తెలుగు తల్లి గేయ రచయిత శ్రీశ్రీ.
◆శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు.
◆శ్రీశ్రీ రాసిన మహా ప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పింది.
◆శ్రీశ్రీ స్వీయ చరిత్ర పేరే అనంతం.
◆తల్లీ భారతి వందనం గేయ రచయిత- దాశరథి కృష్ణమాచార్యులు.
◆ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా దాశరథి కృష్ణమాచార్యులు పనిచేశారు.
◆దాశరథి కృష్ణమాచార్యుల స్వీయ చరిత్ర పేరు యాత్రా స్మృతి.
◆లియోటాల్ స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన రష్యన్ కథకులు.
◆లియోటాల్ స్టాయ్ యుద్ధం శాంతి, అన్నాకెరినీనా లాంటి రచనలు చేశారు.
◆పరమానందయ్య అనే పండితుడు కళింగ రాజ్యంలో ఉండేవారు.
◆పరమానందయ్యకు 12 మంది శిష్యులు ఉండేవారు.
◆పరమానందయ్య స్నేహితుడి పేరు పేరయ్య.
◆ఒక జింక నీళ్లు తాగడానికి సెలయేరు దగ్గరకు వెళ్ళింది.
◆జింక కథ ఈసఫ్ కథల్లోనిది.
◆ఈసఫ్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి పొందాయి.
◆ఈసఫ్ కథలు 2500 సంవత్సరాల నాటివి.
◆’మంచిబాలుడు’ పాఠ్యభాగం సహానుభూతి అనే ఇతివృత్తానికి చెందింది.
◆మంచిబాలుడు అనే పాఠం గేయ కథ ప్రక్రియకు చెందింది.
◆మంచిబాలుడు గేయ కథ రచయిత ఆలూరి బైరాగి,
◆మానవుడి అస్తిత్వ వేదనను కవిత్వంగా వెలువరించిన కవి ఆలూరి బైరాగి,
◆ఆలూరి బైరాగికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డ్ లభించింది.
◆ఆలూరి రచనలు చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్యభవనం మొదలైనవి.
◆కలపండి చేయి చేయి పాట రచయిత- శ్రీ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి,
◆ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వానికి తలుపులు తెరిచిన కవి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి,

◆రాయప్రోలు సుబ్బారావు గారికి అభనవ నన్నయ, నవ్య కవితా పితామహుడు అనే బిరుదులు ఉన్నాయి.
◆’తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, వనమాల’ రాయప్రోలు సుబ్బారావు రచనలు
◆భారత ప్రభుత్వం సుబ్బారావు గారిని పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది.
◆’ఏ దేశమేగినా, ఎందుకాలిడినా’ గేయాన్ని రాయప్రోలు సుబ్బారావు గారు రచించారు.
◆1893 సెప్టెంబరు 11వ తేదీన షికాగోలో కొలంబస్ హాలులో సర్వమత మహాసభలో స్వామి వివేకానందుడు చక్కని ఉపన్యాసం ఇచ్చారు.
◆”ప్రార్థనలు, కర్మకలాపాలు చిత్తశుద్ధికి పనికి వస్తాయి. విగ్రహారాధన ధ్యానానికి ఉపయోగపడుతుంది. భగవంతుని దర్శనం లభించాలంటే ముందు మనలోని అహంకారం నశించాలి” అని వివేకానందుడు అన్నారు.
◆’సాయం’ ఒక అనువాద కథ.
◆జాక్కోప్ దక్షిణాఫ్రికాకు చెందిన కవి, కథకుడు, నవలారచయిత.
◆”అమ్మా! అటుచూడు ఆ పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది” అన్నాడు రవి.
◆సాయం పాఠంలో ఇతివృత్తం పరోపకారం (భూతదయ).
◆తన దేహాన్ని కోసి ఇచ్చి పావురాన్ని కాపాడిన చక్రవర్తి శిబి చక్రవర్తి.
◆”బాపూజీ! మీరు మట్టిలో మాణిక్యాలు వెలికి తీయగలరు. అందువల్లనే మీరు మహాత్ములు. మీ భావాన్ని అందుకోలేక నవ్వినందుకు నన్ను మన్నించండి” అని బాపూజీ పాదాలను స్పృశించారు మహాదేవ్ జీ.
◆కరుణశ్రీ పిల్లలకోసం తెలుగుబాల శతకం రచించారు.
◆జంధ్యాల పాపయ్యశాస్త్రి కరుణశ్రీగా ప్రసిద్ధులు.
◆’జమదగ్ని’ అనే కలం పేరుతో చెరుకుపల్లి జమదగ్నిశర్మగారు రచనలు చేశారు.
◆పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా జమదగ్నిగారు కథలను రాశారు.
◆కొండవాగు పాఠ్యాంశం లేఖ ప్రక్రియలో ఉన్నది.
◆’చూడాలనుకోవాలే గానీ ప్రకృతిలో ప్రతి దృశ్యం అందమైనదే. వినాలనుకోవాలేగానీ ప్రకృతిలో ప్రతి శబ్దం అద్భుతమైనదే’ ఈ వాక్యాలు కొండవాగు పాఠంలోనివి.
◆’జననీ జనకుల గొలుచుట
◆తనయునకును ముఖ్యమైన ధర్మము జననీ’ పద్య పాదాలను శ్రీనాథుడు రచించాడు.

◆దేవులపల్లి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారు.
◆దేవులపల్లి రచనలు – కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం.
◆అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం దేవులపల్లి వారి కవిత్వ లక్షణాలు.
◆ఇక్షు సముద్రం అంటే చెరుకు రస సముద్రం.
◆నా బాల్యం పాఠం ఆత్మకథ ప్రక్రియకు చెందింది.
◆నాజర్ని వాళ్ళ తాత అబ్దుల్ అజీజ్ అని పిలిచే వారు.
◆పాఠశాల వార్షికోత్సవంలో నాజర్ వేసిన నాటకమే ద్రోణ విజయం.
◆బుర్రకథ పితామహుడు షేక్ నాజర్.
◆నాజర్ గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి, 5న జన్మించారు.
◆నాజరు భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ అవార్డ్ ఇచ్చింది.
◆నాజర్ జీవిత కథకు ‘పింజారి’ అని పేరు పెట్టింది అంగడాల రమణమూర్తి గారు.
◆నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి బీనాబీ,
◆కొండపల్లి బొమ్మల్ని ‘పొణికి’ కర్రతో తయారు చేస్తారు.
◆కృష్ణాజిల్లా కొండపల్లి కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి.
◆బంగారు పాపాయి పాట రచయిత మంచాళ జగన్నాథరావు.
◆’చూశావా! రాజా! ఈ యొక్క నాటిన రోజే బంగారు కాసులు కాసింది’ అని తాత సంబరపడ్డాడు.
◆పొడుపు విడుపు సంభాషణ ప్రక్రియకు చెందిన పాఠం.
◆పొడుపు విడుపు రచయిత చింతా దీక్షితులు.
◆గిరిజనులు, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత చింతా దీక్షితులు,
◆చింతా దీక్షితుల రచనలు – ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్కపిడతలు మొదలైనవి.
◆చందమామ పాట రాసిన కవి నండూరి రామ్మోహనరావు.
◆నండూరి రామ్మోహన్రావు రచించిన బాల గేయాల సంపుటి పేరు హరివిల్లు.
◆నండూరి రచనలు – నరావతారం, విశ్వరూపం. వీటి ద్వారా సులభశైలిలో పాఠకులకు పరిచయం చేశారు.
◆వికటకవిగా పేరు పొందిన వారు తెనాలి రామకృష్ణుడు.
◆’ఢిల్లీ వెళదాం – రాజును చూద్దాం’ అని మేమే మేకపిల్ల అంది.
◆మేమే మేక పిల్ల పరస్పర సహకారం ఇతివృత్తానికి చెందిన కథ.
◆మే మే మేకపిల్ల కథ రచయిత ఆర్. శకుంతల,
◆తెలుగు తోట గేయ రచయిత- కందుకూరి రామభద్రరావు.
◆కందుకూరి రామభద్రరావు రచనలు లే మొగ్గ, తరంగిణి, గేయమంజరి మొదలైనవి.
◆’బహుళ కావ్యములను పరికింపగా వచ్చు’ ఈ పద్యం వేమన రచించాడు.
◆వేమన 17-18 శతాబ్దాల కాలం నాటి కవి.◆సుమతి శతక కర్త బద్దెన, 13వ శతాబ్దం వాడు.
◆గువ్వల చెన్నడు 17-18 శతాబ్దాలకు చెందిన కవి, గువ్వల చెన్నా మకుటంతో శతకం రాశాడు.
◆జంధ్యాల పాపయ్యశాస్త్రి గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామ నివాసి,
◆జంధ్యాల పాపయ్యశాస్త్రి రచనలు- విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ మొదలైనవి.
◆తెలుగు బాల శతకకర్త – జంధ్యాల పాపయ్య శాస్త్రి,
◆దువ్వూరి రామిరెడ్డి నెల్లూరు జిల్లా వాసి,
◆దువ్వూరి రచనలు – కృషీవలుడు, జలదాంగన, గులాబీ తోట, పానశాల మొదలైనవి.
◆తాళ్ళపాక తిమ్మక్క తెలుగులో మొదటి కవయిత్రి,
◆తాళ్ళపాక తిమ్మక్క అసలు పేరు – తిరుమలమ్మ.
◆సుభద్రా కళ్యాణం రచించింది తాళ్ళపాక తిమ్మక్క
◆అందమైన పాట రచయిత- జి.వి. సుబ్రహ్మణ్యం.
◆తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేసినవారు- జి.వి. సుబ్రహ్మణ్యంగారు.
◆జి.వి. సుబ్రహ్మణ్యంగారి రచనలు వీరరసం, రసోల్లాసం మొదలైనవి.
◆దిలీపుడి భార్య పేరు – సుదక్షిణాదేవి.
◆దిలీపుడి కుమారుడు రఘుమహారాజు.
◆”ఓ రాజా! నీ ధర్మనిరతిని పరీక్షించడానికే మేం ఈ సింహాన్ని సృష్టించాము. నువ్వు మా పరీక్షలో నెగ్గావు. ఇక నీవు నిశ్చింతగా వెళ్ళవచ్చు” అని దిలీపునితో దేవతలు పలికారు.
◆’మా వూరి ఏరు’ ప్రకృతివర్ణన ఇతివృత్తంగా సాగిన గేయం.
◆’మా వూరి ఏరు’ గేయ రచయిత- మధురాంతకం రాజారాం.
◆రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400లకు పైగా కథలు రాసిన రచయిత- మధురాంతకం రాజారాం.
◆ఉత్తమ ఉపాధ్యాయుడిగా, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచయిత మధురాంతకం రాజారాం.
◆పంటచేలు పాట రాసినది పాలగుమ్మి విశ్వనాథం.
◆పాలగుమ్మి విశ్వనాథం లలితసంగీతానికి ప్రచారం కల్పించారు.
◆’బుద్ధిబలం కథ’ – పంచతంత్ర కథలకు చెందింది.
◆’బుద్ధిబలం కథ’లో సింహం- కుందేలు పాత్రధారులు.
◆’తొలిపండుగ కథ’లో – “అబ్బా! పూర్ణం బూరెలు, గారెలు, పరమాన్నం నాకు ఎంత ఇష్టమో” అన్నాడు ఆనంద్.
◆అరే! భలే ఉందే ఉగాది పచ్చడి.. తియ్యతియ్యగా పుల్లపుల్లగా.. చేదుచేదుగా అంటూ లొట్టలు వేసుకుతిన్నాడు. శామ్యూల్.
◆ఉగాది పచ్చడి షడ్రుచులతో ఉంటుంది.
◆ఉగాది పండుగను చైత్ర శుద్ధ పాడ్యమినాడు జరుపుకుంటారు.
◆తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలను తెలిపేది పంచాంగం.

◆సంవత్సరాలు 60 ఉంటాయి. మొదటిది ప్రభవ, చివరిది – అక్షయ.
◆తెలుగు నెలలు 12. వాటిలో మొదటిది చైత్రం చివరిది ఫాల్గుణం.
◆’అందాల తోట’ పాట కస్తూరి నరసింహమూర్తి గారు రచించారు.
◆’అందాల తోట’ అనే పాట పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుంచి తీసుకున్నారు.
◆’నక్కయుక్తి’ అనే జానపద కథ రచయిత శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి.
◆జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రసామ్రాజ్యం, రత్నలక్ష్మి శతపత్రం, కేనోపనిషత్తు వీరి రచనలు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *